హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు జరిగాయి. మే 7 నుంచి 11 వరకు నిర్వహించే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీలను మార్చినట్టు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంసెట్ ఫార్మసీ పరీక్షల తేదీల్లో మార్పు లేదని, గత షెడ్యూల్ ప్రకారమే మే 10, 11న ఉంటాయని పేర్కొన్నారు. నీట్ యూజీ ఎగ్జామ్ను మే 7న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందిపడకుండా ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీలకు మార్పు చేశారు. దీంతో ఎంసెట్ పరీక్షలు ఇంజినీరింగ్తో కాకుండా, అగ్రికల్చర్, ఫార్మసీతో ప్రారంభంకానున్నాయి.
ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. శుక్రవారం వరకు 1,92,858 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్కు 1,23,129, అగ్రికల్చర్, మెడికల్కు 69,233, ఇంజినీరింగ్, అగ్రికల్చర్మెడికల్ రెండింటికి కలిపి 223 దరఖాస్తులు నమోదైనట్టు ఎంసెట్ కన్వీనర్ డీన్కుమార్ వెల్లడించారు. దరఖాస్తుల తుది గడువు ఏప్రిల్ 10 కాగా, ఆలస్యరుసుంతో మే 2 వరకు ఉన్నదని తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
అగ్రికల్చర్, మెడికల్ : 10,11 మే, 2023
ఎంసెట్ ఇంజినీరింగ్ :12, 13, 14 మే, 2023
ఉదయం 9 గంటల నుంచి
మధ్యాహ్నం 12 గంటల వరకు
మధ్యాహ్నం 3 గంటల నుంచి
సాయంత్రం 6 గంటల వరకు