హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్ టెస్ట్ (సీపీగెట్) రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు ఆదివారం కేటాయించారు. ఈ కౌన్సెలింగ్లో 20,743 అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 12,244 మంది అభ్యర్థులు సీట్లు దక్కించుకున్నారు.
సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 28లోగా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడంతోపాటు, ఒరిజినల్ టీసీని కాలేజీలో సమర్పించాలని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. మొదటి విడుతలో 14,119 మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు. మొదటి రెండో విడుత కలుపుకుంటే మొత్తంగా 23,920 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకున్నారు. వీరిలో 17,327 మంది మహిళలు ఉండటం విశేషం. పురుషులు కేవలం 6,593 సీట్లను మాత్రమే దక్కించుకున్నారు.