Inter Advance Supplimentary | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
హాల్టికెట్లు https://tsbie.cgg.gov.in వెబ్సైట్లో అంబుబాటులో ఉన్నాయని, విద్యార్థులు త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. కాలేజీల ప్రినిపాల్స్ కూడా అధికారిక లాగిన్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేయవచ్చని పేర్కొన్నది.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్ టికెట్లు https://bse.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది.