హైదరాబాద్: హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకే ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈని ఎంతో కష్టపడి తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్ను గమ్యస్థానంగా మార్చడమనే గొప్ప ఎజెండాతో ఫార్ములా-ఈ కార్ రేసును ముందుకు తీసుకొచ్చామని చెప్పారు.
తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్, తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా ఉందని వెల్లడించారు. ఈ- మొబిలిటీ వీక్ ద్వారా రూ.12 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని చెప్పారు. నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఫార్ములా-ఈ కార్ రేసు అంశం అర్థం కాలేదని విమర్శించారు. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసన్నారు. తమ ప్రభుత్వ విజన్ను, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని చెప్పారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globally
Agenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI
— KTR (@KTRBRS) January 9, 2025