హైదరాబాద్ : తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు.
టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కంటే ముందు.. ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.