ఖమ్మం, అక్టోబర్ 7: నవ భారత నిర్మా ణం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బంపర్ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశానికి బలమైన నేత కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలని, ప్రభాకర్రెడ్డిని ఆశీర్వదించి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టాలని కోరారు.