చండూరు, అక్టోబర్ 26: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరులో ఈ నెల 30న మధ్యాహ్నం టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభకు లక్ష మందిని తరలించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సభా స్థలిని బుధవారం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గాదరి కిశోర్కుమార్, టీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ పరిశీలించారు. సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. సభ ఏర్పాట్లను టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పర్యవేక్షించనున్నట్టు పేర్కొన్నారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల నుంచి లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. సభా ప్రాంగణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రగా రావడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు.