హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రసంగాలతో దేశ భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. విభజించి పాలించు అనే బ్రిటీష్ సిద్ధ్దాంతాన్ని బీజేపీ పాటిస్తున్నదని మండిపడ్డారు. భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అనే తీర్మానాన్ని టీఆర్ఎస్ ప్లీనరీలో వినోద్ ప్రవేశ పెట్టి ప్రసంగించారు.
బీజేపీ 80ః20 నినాదాన్ని వినిపిస్తున్నదని, 80 శాతం హిందువులు, 20 శాతం హిందుయేతరులు ఉన్నారని ప్రచారం చేస్తున్నదని, కుటిల రాజకీయ నీతిని ప్రదర్శిస్తున్నదని అన్నారు. తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్యారు కాబట్టి ప్రశాంతంగా ఉన్నదని, లేకుంటే గతంలో నిత్యం అలర్లు జరిగేవని ఆయన గుర్తుచేశారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బలపర్చారు. దేశంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరుగడం లేదని అన్నారు.