న్యూఢిల్లీ, మే 25: అమరరాజా బ్యాటరీస్లో 10 శాతం వాటాను మరో కార్ల బ్యాటరీ కంపెనీ క్లారియోస్ మంగళవారం బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది. ఈ వాటా విలువ రూ.1,276 కోట్లు. షేరుకు రూ.747.22 సగటు ధరపై 1,70,81,250 అమరరాజా షేర్లను క్లారియోస్ విక్రయించగా, మోర్గాన్స్టాన్లీ ఆసియా, ఇంటిగ్రేటెడ్ కోర్, ఘిసల్లో మాస్టర్ ఫండ్ ఆ షేర్లను కొన్నాయి. ఈ సందర్భంగా బీఎస్ఈలో షేరు ధర 6 శాతం క్షీణించి రూ. 735 వద్ద ముగిసింది. తాజా లావాదేవీ అనంతరం క్లారియోస్ వద్ద ఇంకా 14 శాతం అమరరాజా వాటా వుంది.