Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్కు 32,505 బీజేపీకి 30,974, కాంగ్రెస్కు 10,063 ఓట్లు పోలయ్యాయి. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1535 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఐదో రౌండ్లో నారాయణపురం మండల పరిధిలోని ఓట్లను లెక్కించారు. ఇప్పటివరకు 78751 ఓట్ల ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఇంకా లక్షన్నర ఓట్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
చౌటుప్పల్ మండల పరిధిలోని నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 26443 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 25729, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 7380, బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకర్కు 907 ఓట్లు పోలయ్యాయి.