Union Budget 2022 | కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ కు రూపం, స్వరూపం లేదు. బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచింది. మోదీ సర్కార్ తెలంగాణపై కత్తికట్టి పీడిస్తోంది. కేంద్ర బడ్జెట్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్కవర్గాన్ని సంతృప్తిపరిచేలా ఈబడ్జెట్ లేదు. గ్రామీణాభివృద్ధికి కూడా నిధుల్లో కోత పెట్టారు. కొత్త రాష్ట్రానికి ఎటువంటి మద్దతు లేదు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదు.
రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఆ దిశగా చర్యలు లేవు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్ఆరు. ఆరోగ్య రంగాన్ని గాలికి వదిలేశారు. ఉపాధి హామీ పథకానికి 25 శాతం నిధులు తగ్గించారు. కేంద్రబడ్జెట్పై రచ్చబండలోనూ చర్చ జరగాలి. క్రిప్టో కరెన్సీపై క్లారిటీ లేదు. 30 శాతం పన్ను విధించారంటే లీగల్ చేస్తారా? దశ దిశ నిర్దేశం లేకుండా నిరుపయోగంగా బడ్జెట్ ఉందని ధ్వజమెత్తారు.
పేదలు, మధ్య తరగతి వర్గాలకు ఎలాంటి లబ్ధి కలగదు. కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక, పేదలు, ఉద్యోగులు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. బడ్జెట్లో కేటాయింపులపై అన్ని రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రజలకు ఉపయుక్తంగా లేదని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు.