హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంత ఉన్నదో చెప్పాలని ప్రధాని మోదీని ఎమ్మె ల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్న మోదీ, తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని సవాల్ విసిరారు. మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.