లద్దాఖ్లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందడం తననెంతో బాధించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇదో అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం షియోక్ నదిలో పడి.. జవాన్లు దుర్మరణం చెందారని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కవిత పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జవాన్లు తొందరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
లద్దాఖ్లో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయానిస్తున్న వాహనం నదిలో పడి.. ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందారు. మరో 19 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పార్ధాపూర్ సైనిక శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహనంలో వెళ్తుండగా.. ఈ దుర్ఘటన జరిగిందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఈ వాహనం టుర్టుక్ సెక్టార్ ప్రాంతంలో రోడ్డుపై నుంచి జారి షియోక్ నదిలో పడిపోయింది.
Pained to hear about the unfortunate accident and demise of our Indian Army soldiers in Ladakh. I extend my heartfelt condolences to the families our martyrs and pray for speedy recovery of those injured.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 27, 2022