వరంగల్ : రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ రెండు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పరామర్శించారు. లింగ్యా నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
మంత్రి సత్యవతి రాథోడ్ను పరామర్శించిన వారిలో మహబూబాబాద్ కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, పశుసంవర్దక శాఖ, మత్స్య శాఖ కమిషనర్ లచ్చి రామ్ నాయక్, విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్, తొర్రూరు డీఎస్పీ వెంకట రమణ , కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, టీఆర్ఎస్ నేతలు నూకల నరేష్ రెడ్డి, సమ్మరావు, నూకల రంగారెడ్డి, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి శ్రీధర్ రెడ్డి, మూల మధుకర్ రెడ్డి, మార్నెనీ వెంకన్న, ప్యాట్ని మన్యు, తాళ్లూరి హనుమ, దుర్గా ప్రసాద్, శ్రీరామ్ నాయక్, శ్రీకాంత్ నాయక్, సిరి నాయక్, అంబరీష్,అఫ్జల్, బద్రు నాయక్, జగదీశ్ నాయక్, పెద్ద తండా సర్పంచ్ వనజా శ్రీరామ్ ఉన్నారు.