హనుమకొండ : స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాతృమూర్తి లక్ష్మి(87) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి.. హనుమకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచింది. తల్లి మరణ వార్త తెలుసుకున్న రాజయ్య తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాడు. ఎమ్మెల్యే కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎమ్మెల్యే రాజయ్య మాతృమూర్తి లక్ష్మి మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. రాజయ్య కుటుంబానికి సీఎం, మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.