హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత కల్లోలాలు లేవు.. ప్రజలందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కిరణ్ మాట్లాడారు.
నేరాలను అరికట్టడంలో, నేరస్తులను అరెస్టు చేయడంలో మన పోలీసులు దేశంలోనే నంబర్ వన్లో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్లో కర్ఫ్యూ అనే పదమే వినపడట్లేదు. పోలీసులు ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. నేరం జరిగిన ప్రాంతానికి పోలీసులు 5 నిమిషాల్లో చేరుకుంటున్నారు. నేరస్తులను అతి తక్కువ సమయంలోనే పట్టుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. స్వరాష్ట్రంలో నేరాలు బాగా తగ్గిపోయాయి. పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు.