నిజామాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ అంటే బ్రోకర్ జోకర్ పార్టీ అని నిజా మాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో బ్లేడ్ బాబ్జీలా మారారని ఎద్దేవాచేశారు. హిందువును అని చెప్పుకొంటూ హిందూ దేవతలను కించపరచడం అర్వింద్కే చెల్లిందని, కుద్వాన్పూర్ ఎల్ల మ్మ ఆలయం ఎదుట ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, జెడ్పీ చైర్మన్ విఠల్రావుతో కలిసి జీవన్రెడ్డి ఆదివారం నిజామాబాద్లో మీడియాతో మాట్లాడా రు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తంబాకు సంజయ్ అయితే ఎంపీ గంజాయి అర్వింద్ అని అభివర్ణించారు. నోటి కొచ్చినట్టు మాట్లాడటం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం అర్వింద్కు అలవాటేనని తెలిపారు. 2023 ఎన్నికల్లో అర్వింద్ను ఎల్లమ్మ తల్లి తప్పకుండా రాజకీయంగా బలి తీసుకుంటుందని జోస్యం చెప్పా రు. టీఆర్ఎస్ గెలిస్తే బ్లేడ్తో గొంతు కోసుకొంటానని గతంలో బండ్ల గణేశ్ చెప్పాడని.. సీపీఐ నారాయణ, ఉత్తమ్కుమార్రెడ్డి సైతం ఇదేవిధంగా సవాళ్లు విసిరి టీఆర్ఎస్ ధాటికి కొట్టుకుపోయారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. బీజేపీకి డిపాజిట్లు కూడా రావని, గొంతు కోసుకొనేందుకు అర్వింద్ సిద్ధంగా ఉండాలన్నారు.