హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం సెప్టెంబర్ 3న జరుగనున్నది. మధ్యా హ్నం 2గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమవుతున్నది. అనంతరం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఈ సమావేశానికి సీఎం కేసీఆర్తోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీ ఎంపీలు పాల్గొంటారు. రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నూతన పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు, తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.