నాంపల్లి: తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటూ తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా సేవలందించిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు మధుసూదనాచారి నివాసంలోనే ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నిఖార్సైన ఉద్యమ కారుడిగా, అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన మధుసూధనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యులు కొంత గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆలుగడ్డల అనిల్ కుమార్, వొద్యారపు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.