హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు మరో సాంస్కృతిక ఉద్యమానికి నాంది పలుకాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. విభిన్న సంసృతులకు ఆలవాలమైన విశాల భారతదేశంలో అనేక సంసృతులు, భాషలు, మతాలు కలిసి పురోగమించాయని గుర్తుచేశారు. సంసృతుల మధ్య చిచ్చు పెట్టే క్రీడలను ప్రజాస్వామిక వాదులు తిప్పికొట్టాలని కోరారు. శుక్రవారం పలువురు ప్రముఖులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి ఆమెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతున్నదని గుర్తుచేశారు. సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ.. ఈ రాష్ట్రంలోని అందరి సమష్టి సంఘర్షణ వల్లే సాధ్యమైందని వివరించారు.
ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎత్తిపట్టే దిశగా ఢిల్లీ కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణగా మార్చుకుంటున్న తరుణంలో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే నీచ సంసృతికి కొందరు పాల్పడటం దురదృష్టకరమన్నారు. నాటి నుంచి నేటి వరకు ఢిల్లీ పాలకులపై తిరగబడ్డ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గడ్డ, ఢిల్లీ పీఠానికి పదేపదే తన అస్తిత్వాన్ని చాటిన పౌరుషాల గడ్డ తెలంగాణ అని స్పష్టంచేశారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం సవతి ప్రేమను చూపుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాలను బలంగా వినిపించే నాయకత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ అకడి నాయకత్వంపై బురదజల్లడం, ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి వారి దృష్టిని అభివృద్ధి నుంచి మరల్చడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఈ కుట్రలను ఛేదించి తెలంగాణ అస్తిత్వాన్ని ఎత్తి పడుతారని, ఇకడి గంగా జమునా తెహజీబ్ను కాపాడుతారని స్పష్టంచేశారు.
బీజేపీవి నిరాధారమైన ఆరోపణలు
బీజేపీ అరాచక రౌడీయిజాన్ని తెలంగాణ సహించదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి వెళ్లి ఆయన సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ ఢిల్లీ నాయకులు నిరాధారమైన ఆరోపణలకు దిగితే.. గల్లీ నాయకులు, కమలం గూండాలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి తెగబడటం కుట్రపూరితమని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు తమను తాము ఎకువగా ఊహించుకుంటూ.. సీఎం కేసీఆర్పైనా, వారి కుటుంబసభ్యులపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతచిచ్చు పెట్టేందుకు ఎంపీలు బండి సంజయ్, అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు తలవంపులు తెస్తున్నదని ధ్వజమెత్తారు. కవితను కలిసిన వారిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, క్రాంతికిరణ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, కార్పొరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, సాయిచంద్, కోలేటి దామోదర్ గుప్తా, రావుల శ్రీధర్రెడ్డి, మేడే రాజీవ్సాగర్, వాల్యానాయక్, రామచంద్రునాయక్, తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఉన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాంబాబు యాదవ్, అధ్యక్షురాలు నల్ల భారతి తదితరులు ఉన్నారు.