మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకుల గాలిమాటల మోసాలపై టీఆర్ఎస్ నేతలు వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఫ్లోరోసిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆండ్ హాస్పిటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిన జేపీ నడ్డా తీరుకు నిరసనగా మర్రిగూడ బస్టాప్ వద్ద ‘జేపీ నడ్డా ఉత్తుత్తి దవాఖాన’ నమూనాను ప్రదర్శించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వినూత్న నిరసనకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకుల గాలి మాటల మోసాలపై టీఆర్ఎస్ నేతలు వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఫ్లోరోసిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆండ్ హాస్పిటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిన జేపీ నడ్డా తీరుకు నిరసనగా మర్రిగూడ బస్టాప్ వద్ద ‘జేపీ నడ్డా ఉత్తుత్తి దవాఖాన’ నమూనాను ప్రదర్శించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వినూత్న ప్రదర్శనకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ‘జేపీ నడ్డా ఉత్తుత్తి దవాఖానను చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు.