సిద్దిపేట : రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు మంత్రి హరీశ్రావును బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
హరీశ్రావుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ చైర్మన్ మల్కాపురం శివకుమార్తో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతరులు ఉన్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు.