హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): నిర్మలంగా ఉన్న చెరువులో బండరాయి ఎత్తేసినట్టు.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ‘దాడులు, బూతుల’ సంస్కృతిని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తెచ్చి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్పై, టీఆర్ఎస్ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ స్థాయి మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. టీఆర్ఎస్ నేతలను, శ్రేణులను రెచ్చగొట్టి హింస చెలరేగేలా కుట్ర చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. బండి సంజయ్ మొదలు ఆ పార్టీలో ఏ స్థాయి నేతలైనా ‘బూతుల’కు కేరాఫ్గా నిలుస్తున్నారని అంటున్నారు. కేవలం తిట్టడానికే ప్రెస్మీట్లు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రజలను మతం పేరుతో విభజించి, రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీజేపీ నేతలు ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇందుకు రాజాసింగ్నే ఉదాహరణగా చూపుతున్నారు.
2014లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గతేడాది వరకు తెలంగాణలో ఎలాంటి ఘర్షణ పూరిత వాతావరణం లేదు. కానీ.. ఏడాదిన్నరగా బీజేపీ నేతలు తరచూ గొడవలు సృష్టిస్తున్నారు. ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు తమను ఆదరించడం లేదని వారికి తేలిపోవటంతో డైవర్షన్ డ్రామాకు తెరలేపారని రాజకీయ పండితులు అంటున్నారు.
2021,- నవంబర్ 15ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో బండి సంజయ్ నల్లగొండ జిల్లాకు వెళ్లారు. ఆయన అనుచరులు కార్లలో కంకర రాళ్ల బస్తాలతో దిగారు. బండీ రావొద్దంటూ నిరసన తెలిపిన రైతులపై ఇష్టం వచ్చినట్టు దాడికి దిగారు.
2021 నవంబర్ 23..: బీజేపీకి చెందిన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండగా సమావేశాలు నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో ఏవైనా సమస్యలు ఉంటే తనకు వివరించాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. అయినా కార్పొరేటర్లు వినకుండా ప్లాన్ ప్రకారం ఆఫీస్పై దాడికి దిగారు.
2022 ఫిబ్రవరి 9: తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ రాజ్యసభలో అవమానించారు. దీనిపై జనగామలో టీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగడంతో బీజేపీ నేతలు కర్రలతో వచ్చి దాడికి పాల్పడ్డారు.
2022 ఆగస్టు 22..: బీజేపీ నేతలు, కార్యకర్తలు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించారు. దాడికి యత్నించారు. అడ్డుకోబోయిన టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు.
v 2022 నవంబర్ 2..: టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ నోరుపారేసుకోగా.. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దీంతో కక్ష పెంచుకున్న బీజేపీ శ్రేణులు హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయంపై దాడి చేశారు.
మునుగోడులో బీజేపీ చేసిన దాడుల వివరాలు..