నల్లగొండ: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి గాదరి మరయ్య పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కిషోర్ కుటుంబానికి ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, జడ్పీ చైర్లన్లు బండా నరేందర్ రెడ్డి, గుజ్జ దీపికా, మాజీ ఎమ్మెల్యేలు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వేముల వీరేశం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తండ్రి మారయ్య (73) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నల్లగొండ మండలం నర్సింగ్భట్లకు చెందిన గాదరి మారయ్య పీఈటీగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సేవలందించారు. నల్లగొండ పట్టణంలో కుటుంబంతో కలిసి శేషజీవితం గడుపుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మారయ్య మరణించారు.