టీఎస్ఎండీసీ ఎండీ క్రిశాంక్ ట్వీట్
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఓ వ్యక్తిని రూ.కోట్లలో మోసం చేసిన ఆరోపణల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్పై మహారాష్ట్రలో కేసు నమోదైంది.
దీనిపై టీఎస్ఎండీసీ చైర్మన్, టీఆర్ఎస్ నేత క్రిశాంక్ ‘‘రేవంతూ.. అశోక్ గెహ్ల్లాట్ ఏ పార్టీ ముఖ్యమంత్రి’’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నపై నెటిజన్లు ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. ‘ఎదుటి వారికి నీతులు చెప్పడం తప్ప, ప్రజల విషయంలో కాంగ్రెస్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉండదు’.. ‘ఓటుకు నోటు గుర్తుందా రేవంత్’.. ‘ఇలాంటి ప్రశ్న వేస్తే రేవంత్రెడ్డి ఎలా సమాధానం చెబుతారు’.. ‘రేవంత్ ఒక్కడే కాదు ఆయన తోటి కాంగ్రెస్ నాయకులందరూ దొంగలే’…అంటూ ట్వీట్లు చేశారు.