హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ కమలాకర్ రెడ్డి.. తీన్మార్ మల్లన్నపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలిలో పెట్రేగిపోతున్న కబ్జా రాయుళ్లు అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఫిర్యాదుకు అటాచ్ చేశారు. కబ్జా రాయుళ్ల వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని అసత్య ప్రచారం చేస్తున్న తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కమలాకర్ రెడ్డి పోలీసులను కోరారు. కేటీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తున్న తీన్మార్ మల్లన్నను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.