నల్లగొండ పట్టణంలోని 26వ వార్డు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై 445 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆసిమా సుల్తానా గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలోని 18వ వార్డు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కర్రోళ్ల గంగారాం ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్పై 175 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.