హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని 1998 డీఎస్సీ సాధన సమితి పిలుపునిచ్చింది.
సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నేతృత్వంలో బృందం ఆదివారం మర్రిగూడ మండలం లెంకలపల్లిలో ప్రచారం నిర్వహించింది. ఓటర్లంతా బీజేపీకి గుణపాఠం చెప్పి కూసుకుంట్లను గెలిపించాలని కోరారు.