జనగామ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కనొసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండా సర్పంచ్ భూక్యా వీరేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూక్యా కృష్ణ, మరికొంత మంది నేతలులు టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో వారు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు ఉంటుందన్నారు.
కాగా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరామని సర్పంచ్ వీరేశ్ తెలిపారు.
కార్యక్రమంలో దేవరుప్పుల టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, పల్లా సుందర్ రాంరెడ్డి, జనగామ జిల్లా యువజన నాయకుడు కోతి ప్రవీణ్, కొడకండ్ల ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.