హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ) : ‘తొందరపడి ఒక కోకిలా ముందే కూసిందీ.. విందులు చేసిందీ.’ పాత సినిమాలోని ఈ పాట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సరిగ్గా సరిపోతున్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరినట్టు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినట్టు ఆయన భ్రమల్లో తేలియాడిన రేవంత్రెడ్డి.. టీఆర్ఎస్పై ఏవేవో అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారు. చివరికి తన ఇజ్జత్ తానే తీసుకున్నాడు. పీకే విషయంలో అతి ఉత్సాహం ప్రదర్శించి బొక్కబోర్లా పడ్డారు. పీకే కాంగ్రెస్లో చేరినట్లే భ్రమించిన ఆయన టీఆర్ఎస్పై అవాకులు చవాకులు పేలారు. తీరా పీకేనే స్వయంగా కాంగ్రెస్లో చేరేది లేదని ప్రకటించి.. హ్యాండ్కే ‘హ్యాండ్’ ఇచ్చేసరికి రేవంత్రెడ్డి మైండ్ బ్లాకై నాలుక మడ్తపడింది.
దాంతో మాట మార్చిన రేవంత్రెడ్డి.. తన వ్యాఖ్యలను తానే ఖండించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరకపోతే మరీ మంచిదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. పార్టీలో చేరడం, చేరకపోవడం ఆయన వ్యక్తిగత విషయమంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. రెండు రోజుల క్రితం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహంపై సీఎంతో చర్చించారు. ఈ భేటీపై రేవంత్రెడ్డి అజ్ఞానంతో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు.
సీఎంతో పీకే భేటీ అయింది.. టీఆర్ఎస్తో ఒప్పందం రద్దుకే తప్పా.. కలిపి పని చేసేందుకు కాదంటూ దీర్ఘాలు తీశారు. ‘పీకేతో కలిసి తెలంగాణలో ప్రెస్మీట్ పెట్టే రోజు అతి దగ్గర్లోనే ఉంది. పీకే నోటితోనే టీఆర్ఎస్ను ఓడించండని చెప్పిస్తాం’ అంటూ అవాకులు చెవాకులు పేలారు. తీరా ఇప్పుడు పీకేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ప్రకటించడంతో రేవంత్రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టై యూటర్న్ తీసుకున్నారు.
ఆటాడుకున్న నెటిజన్లు
కాంగ్రెస్లో చేరడం లేదని ప్రశాంత్ కిశోర్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రేవంత్రెడ్డిని ఆటాడుకున్నరు. పీకే చేరికపై ఆయన చేసిన వ్యాఖ్యలకు పాత పాటలను, మీమ్స్ను జోడించి ట్రోల్ చేశారు. ‘రేవంత్రెడ్డి.. పీకేతో కలిసి తెలంగాణలో ప్రెస్మీట్ ఎప్పుడు పెడుతున్నావ్’. ‘పీకే నోటితో టీఆర్ఎస్ను ఓడిస్తామని ఎప్పుడు చెప్పిస్తున్నావ్’. ‘పీకే తిరస్కరించింది, ఛీ కొట్టింది ఎవర్నో తెలిసిందా.. రేవంత్రెడ్డి’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్రోలింగ్ చేశారు.