ఖైరతాబాద్, జనవరి 4: నిమ్స్ దవాఖానలో త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి టీ అమర్నాథ్ గౌడ్ గురువారం సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ సాయిసతీశ్, జనరల్ మెడిసిన్ వైద్యులు నాగేశ్వర్రావు, శెల్లి, పల్మనాలజీ స్పెషలిస్ట్ పరంజ్యోతి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరిగాయి. అనంతరం డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్పను జస్టిస్ కలిసి నిమ్స్లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పేద వారికి అందిస్తున్న వైద్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు.