హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినోత్సవం సందర్భంగా బుధవారం జలసౌధలో నిర్వహించిన కార్యక్రమంలో దివంగత ఇంజినీర్లకు ఘనంగా నివాళులర్పించారు. నవాజ్ అలీ జంగ్ బహదూర్ వర్ధంతి రోజైన డిసెంబర్ 6న ప్రతి ఏటా ‘తెలంగాణ ఇంజినీర్ల మెమోరియల్ డేగా నిర్వహిస్తూ వస్తున్నారు.
గత ఏడాది కాలంలో అన్ని శాఖల్లో మృతిచెందిన 62 మంది ఇంజినీర్లను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి చిత్రపటాల ఎదుట కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. బీఆర్ అంబేదర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కూ నివాళులర్పించారు. కార్యక్రమంలో సాగునీటిశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లు మురళీధర్, అనిల్కుమార్, వెంకటేశ్వర్లు, చీఫ్ ఇం జినీర్ అనిత తదితరులు పాల్గొన్నారు.