హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): స్వామి రామానంద తీర్థ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి బేగంపేటలోని రామానంద ట్రస్టులో స్వామీజీ విగ్రహానికి ఆదివారం నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో పీవీ ప్రభాకర్రావు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.