కామారెడ్డి : లింగంపేట్ మండలం ముంబోజిపేట్ తండాలో అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. ట్రాక్టర్లతో పొలం చదును పనులు గిరిజనులు చేపట్టగా.. రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. అటవీ భూములను అక్రమంగా దున్నుతున్నారని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులపై గిరిజనులు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఫారెస్ట్ అధికారులను గిరిజనుల దాడుల నుంచి కాపాడారు. గాయపడ్డ అధికారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.