హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): పోడు భూములకు ఫిబ్రవరి నెలలో పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున ఆ ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేరొన్నారు. కలెక్టర్లతో సోమవారం బీఆరేఆర్ భవన్ నుంచి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నిరుడునుంచి పోడు భూముల దరఖాస్తులను ఫారెస్ట్ రైట్స్, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి, లబ్ధిదారుల గు ర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు.
సర్వేను గ్రామసభల ద్వారా పూర్తి చేశామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒకరికీ పోడు భూముల పట్టాలివ్వడంతోపాటుగా అడవుల సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని స్పష్టం చేశారు. అర్హులందరికీ పట్టాలివ్వాలన్నది సీఎం కేసీఆర్ అభిలాష అని, అందుకనుగుణంగా పని చేయాలని కలెక్టర్లకు సూచించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో సాలను చేయాలని చెప్పారు.ఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. పట్టా పాస్బుక్లను ప్రింట్ చేసి, ఫిబ్రవరి మొదటి వారానికల్లా సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పీసీసీఎఫ్ డోబ్రియల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు పాల్గొన్నారు.