హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్టు అండ్ హైవేస్ నోటిఫికేషన్ -714ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా రవాణా బంద్కు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. బంద్లో భాగంగా జిల్లా నాయకులతో టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ రాష్ట్ర నాయకుడు వేముల మారయ్య శనివారం ఉప్పల్లోని ఆ సంఘం కార్యాలయంలో సమావేశమయ్యారు. బంద్కు అవలంబించాల్సిన విషయాలపై చర్చించారు.
ఆదివారం జిల్లాస్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్మీట్లు నిర్వహించాలని, ఈ నెల 16న అడ్డా కేంద్రాల్లో బంద్ జయప్రదానికి ప్రచారం చేయాలని సూచించారు. 17న మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, 18న జేఏసీ మాడల్ పోస్టర్ను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.