హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): వాహన్ పోర్టల్లో తలెత్తిన అన్ని సాంకేతిక సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..
‘వాహన్’ పోర్టల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి తమ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతున్నారని, ఢిల్లీకి చెందిన ఎన్ఐసీ బృందాలతో కలిసి ఒక్కో సమస్యను అధిగమిస్తున్నామని తెలిపారు.