షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఐఈఆర్పీలు, సిస్టం అనలిస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్లు బదిలీ కానున్నారు. బదిలీ దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం విడుదల చేశారు. బదిలీ కోసం ఉద్యోగులు https://schooledu.telangana. gov.in వెబ్సైట్ను సంప్రదించి, ఈ నెల 23 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బదిలీల ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహిస్తామని, పూర్తి మార్గదర్శకాలను వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు.