నీలగిరి, సెప్టెంబర్ 8: ఉద్యోగుల బదిలీలకు జోనల్ విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నదని టీఎన్జీవో కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ రాయకంటి ప్రతాప్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని తెలిపారు. బుధవారం వారు నల్లగొండ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయించినట్టు చెప్పారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగులకు కూడా 30 శాతం ఫిట్మెంట్తో కూడిన పీఆర్సీ అమలైందని, ఇందుకు ఉద్యోగుల పక్షాన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎల్లవేళ్లలా అండగా ఉంటున్న విషయాన్ని ఉద్యోగులు మర్చిపోవద్దని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం శ్రవణ్కుమార్, కంచనపల్లి కిరణ్కుమార్, కోశాధికారి మేడి జయరావు, రాష్ట్ర నాయకులు చేపూరి నర్సింహాచారి, కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.