హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉన్న ప్రశాంత్జీవన్ పాటిల్ను బదిలీ చేశారు. ఆయనను రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరిని నియమించారు. మను చౌదరి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఉన్నారు. జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలనా విభాగానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో జనగామ జిల్లా కలెక్టర్గా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను నియమించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజారామయ్యర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న సునీల్శర్మను రిలీవ్ చేశారు.