హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగాణ): లక్ష్మీ బరాజ్ నుంచి 7 పంపుల ద్వారా ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతున్నది. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు ఎత్తిపోతలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రాణహితలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 1,19,800 70వేల క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి అది 70వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఇప్పటికే లక్ష్మీ బరాజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం, వరదను యథావిధిగా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణ నదిలో స్వల్పంగా వరద ప్రవాహం మొదలైంది. ఆల్మట్టికి, తుంగభద్రకు 9582 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.