హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 1,788 మందికిపైగా పీజీ హెచ్ఎంల బదిలీ ఉత్తర్వులు ఆదివారం జారీ అయ్యాయి. రెండు మల్టి జోన్ల పరిధిలో బదిలీలు చేపట్టినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 1,804 మంది బదిలీ కోరుతూ వెబ్ ఆప్షన్లు ఎంచుకుకోగా, కొందరు పాత స్థానాల్లోనే ఉన్నారు. ఎస్ఏలకు హెచ్ఎం ప్రమోషన్ కోసం సీనియార్టీ జాబితాను వెబ్సైట్లో ఉంచారు.