హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సా ధించిన 39 మందికి పోస్టింగ్స్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో 18 మంది జడ్జీలను బదిలీ చేసింది. నూతన జేసీజేలు అక్టోబర్ 4లోగా తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని రిజిస్ట్రార్ జనరల్ (విజిలెన్స్) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త జేసీజేలు అక్టోబర్ 6న తమ బాధ్యతలను మరొకరికి అప్పగించి మ రుసటి రోజు నుంచి సికింద్రాబాద్లోని రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీలో నిర్వహించే శిక్షణ కు హాజరుకావాలని ఆదేశించింది. కోఆపరేటివ్ ట్రిబ్యునల్ సభ్యురాలు డాక్టర్ కిరణ్మ యి కుమార్తె దీక్ష బట్టు తొలి ప్రయత్నంలోనే జేసీజేగా ఎంపిక అయ్యారు. ఆమె ఓయూ నుంచి ఎల్ఎల్బీ చేశారు. ఎల్ఎల్బీలో రెం డు బంగారు పతకాలు సాధించారు.