హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పన్నులశాఖలో ప్రభుత్వం 154 మందిని బదిలీ చేసింది. రెండేండ్ల క్రితం పదోన్నతులు పొందిన, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏడుగురు అదనపు కమిషనర్లు, 24 మంది ఉప కమిషనర్లు, 40 మంది సహాయ కమిషనర్లు, 83 మంది సీటీవోలకు పోస్టింగ్లు ఇచ్చింది. నాలుగైదు ఏండ్లుగా జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను హైదరాబాద్కు, ఇకడ పనిచేస్తున్న ఉద్యోగులను జిల్లాలకు బదిలీ చేసింది. సీటీవోను మల్టీజోన్ 1లో 21 మందిని, మల్టీజోన్-2లో 62 మంది బదిలీ చేశారు. సుమారు 185 మంది అధికారులు పోస్టింగ్ల కోసం వేచి చూస్తుండగా 154 మందికి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. మిగిలిన వారికి ఈ వారంలోనే పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.