హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది. 450 టన్నుల జనరేటర్ రోటర్ అధికారులు బిగించారు. ఈ సందర్భంగా ప్లాంట్ను ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ మొత్తం కలియదిరిగిన ఆయన.. అధికారులు, బీహెచ్ఈఎల్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. అనంతరం సంస్థ ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు.
నిర్మాణ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. బీహెచ్ఈఎల్ సంస్థ అంగీకారం తెలిపిన విధంగా జూన్, 2023 వరకు మొదటి రెండు యూనిట్లను కమర్షియల్ ఆపరేషన్, యూనిట్ను సింక్రనైజ్ చేయాలని ఆదేశించారు. రెండో యూనిట్కు సంబంధించి భారీ బరువున్న 450 టన్నుల జనరేటర్ రోటర్ను 17 మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్లోర్లో క్రైన్ సహాయంతో బిగించిన సమయంలో అక్కడే ఉండి పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.