సంగారెడ్డి : నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్ డ్రగ్ను ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్ నుంచి పాకిస్థాన్కు అక్రమంగా తరలిస్తున్న డ్రగ్ ఎగుమతిని బెంగళూరు ఎన్సీబీ అధికారులు అడ్డుకున్నారు. జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ల్యూసెంట్ డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నుంచి రవాణా జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు ఉద్యోగులను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. 2021 సంవత్సరంలో 25 వేల కిలోల ట్రమడాల్ డ్రగ్ ను ఎగుమతి చేసి నట్లు గుర్తించారు.