కాచిగూడ, నవంబర్ 4: నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. శనివారం కాచిగూడలో ఆమె విలేకరులతో ఆమె మాట్లాడారు.
సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలతోపాటు ఐటీ, ఇన్ఫర్మేషన్, ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా చదివిన యువత ఈ నెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 7893141797 ఫోన్ నంబర్లో కానీ, www.nacsindia.org సైట్లో కానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.