హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లను సిద్ధం చేసుకోవాలని ట్రైనింగ్ ఐజీ తరుణ్ సూచించారు.
రాష్ట్రంలోని 28 పోలీస్ ట్రైనింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. వసతుల విషయంలో రాజీ పడొద్దని సూచించారు.