హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): మొదటి దశలో 9,871 మందికి, రెండో దశలో 5,010 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. ఈ నెల చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ఎస్సై ఉద్యోగాల ఫలితాలు విడుదలకానున్నట్టు పేర్కొన్నారు. ఎస్సై ఉద్యోగార్థుల శిక్షణకు సంబధించి పోలీసు అకాడమీ సిద్ధంగా ఉన్నదని ఆయన ‘నమస్తేతెలంగాణ’తో వెల్లడించారు.
28 కేంద్రాల్లో 14,881 మందికి శిక్షణ
కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలితాలు వెలువడగానే వెంటనే శిక్షణ ప్రారంభిస్తామని ఐజీ తరుణ్జోషి తెలిపా రు. రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణా కేంద్రాల్లో మొత్తం 14,881 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. తొలి దశ శిక్షణ.. సివిల్, ఏఆర్, డ్రైవర్, టెక్నికల్ తత్సమాన పోస్టులకు సంబంధించిన 9,871 మంది అభ్యర్థులకు, రెండో విడతలో మిగిలిన 5,010 మందికి బెటాలియన్స్ శిక్షణ ఇస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అన్ని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ)కి ఎంత మందిని శిక్షణకు కేటాయించాలో పక్కా ప్రణాళికతో సంసిద్ధంగా ఉన్నామని ఐజీ తరుణ్జోషి తెలిపారు. కొత్తగా పోలీసు ఉద్యోగ బాధ్యతలు తీసుకొనే వారికి మా రుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థంగా శిక్షణ అందించేందుకు ఇండోర్, అవుట్డోర్లో కొత్త కోర్సులు తీసుకురానున్నట్టు చెప్పారు. సైబర్ క్రైమ్ నివారణకు, నార్కోటిక్ కేసుల నిరోధానికి కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. స్విమ్మింగ్, డ్రైవింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వంటి కోర్సులను తెస్తున్నట్టు ఐజీ తెలిపారు.