దుండిగల్,ఏప్రిల్ 20 : విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి శిక్షణ, పరిశోధన ఎంతో అవసరమని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబోరేటరీ (డీఆర్డీఎల్) డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి అన్నారు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో సినర్జెమ్ సహకారంతో వెల్డింగ్ ఇన్ నాన్ డిస్ట్రిక్టివ్ టెస్టింగ్(ఎన్డీటీ) టెక్నాలజీస్తో ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను శనివారం ప్రారంభించారు. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యాలను అందించేందుకు ప్రయోగశాలలను స్థాపించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
విద్యార్థులకు పుష్కలమైన అవకాశాలు కల్పించడానికి తమ కళాశాల కట్టుబడి ఉన్నదని ఫౌండర్ సెక్రటరీ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి, ప్రిన్సిపా ల్ కే శ్రీనివాసరావు, శాస్త్రవేత్తలు సీవీఎస్ మూర్తి, ఎస్ కృష్ణమోహన్, జీవీ శివరావు, ఎం వెంకట్రెడ్డి, డాక్టర్ పీ మస్తానయ్యా, పాల్గొన్నారు.